KMM: మధిర బంజారా కాలనీలో గల శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం లక్ష్మీ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పూజారులు ప్రత్యేక అభిషేకాలు విశేష పూజలు చేశారు. స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ పరిసరాలు భక్తుల కోలాహలంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.