E.G: APSRTC ఎంప్లాయిస్ యూనియన్ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జీ. చిరంజీవి విజయవాడ జోనల్ అధ్యక్షుడిగా ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా RJY డిపో ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు ఆయనను దుశ్శాలువాతో ఘనంగా సన్మానించి, మెమోంటో అందజేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని ఈ సందర్భంగా పలువురు కోరారు.