KKD: పిఠాపురం పట్టణంలోని ఉప్పాడ సెంటర్లో ఉన్న పార్క్ వద్ద మంగళవారం రాత్రి SI మణికుమార్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. SI మాట్లాడుతూ.. ఎవరైనా ఫోన్ చేసి మీ OTP నంబర్లు గానీ, బ్యాంకు వివరాలు అడిగితే ఇవ్వరాదన్నారు. ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తే వెంటనే సమాచారం అందించాలని సూచించారు.