కృష్ణా: గన్నవరం మండలం కొండపావులూరులోని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సౌత్ క్యాంపస్ను సోమవారం మంత్రి వంగలపూడి అనిత సందర్శించారు. రాష్ట్రంలో విపత్తు రిస్క్ను తగ్గింపుపై మూడు రోజుల పాటు జరిగే శిక్షణను మంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలో ఎటువంటి విపత్తు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా సీఎం చంద్రబాబు ఆదేశాలతో అన్ని శాఖల అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు.