కృష్ణా: రాష్ట్రంలో ఏ ఒక్క రైతుని అడిగినా అమ్మిన పంటకు రెండు రోజుల్లో తమ అకౌంట్లోకి డబ్బులు పడుతున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారని విజయవాడ తూర్పు నియోజకవర్గ MLA గద్దె రామ్మోహనరావు అన్నారు. సోమవారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో రైతులు ధాన్యాన్ని అమ్మిన కొన్ని నెలల వరకు కూడా రైతుల ఎకౌంట్లోకి డబ్బులు పడేవి కావన్నారు.