PLD: మాచర్ల మండలం పశువేములలో సోమవారం రాత్రి రమేష్ అనే వ్యక్తిపై దుండగులు మారణాయుదాలతో దాడి చేశారు. ఈ ఘటనలో రమేష్కు తీవ్ర గాయాలవడంతో పరిస్థితి విషమంగా ఉంది. దీంతో అతడిని మెరుగైన చికిత్స కోసం నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలే దాడికి కారణమని గ్రామస్తులు అంటున్నారు. దీనిపై రమేష్ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు.