W.G: తిరుపతిలో విఐపి దర్శనం ఇప్పిస్తానని డబ్బులు కాజేసిన ఇద్దరు వ్యక్తులను సోమవారం తణుకు పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాదుకు చెందిన గునిశెట్టి రాజకుమార్, వైట్ల సురేష్ కలిసి కలిశెట్టి సూర్యప్రకాష్ అనే వ్యక్తికి ఫోన్ చేసి విఐపి దర్శనం ఇప్పిస్తానని రూ. 31 వేలు కాజేశారు. దీంతో అనుమానం వచ్చిన సూర్య ప్రకాష్ తణుకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.