KDP: ప్రజలు, రైతులకు సంబంధించిన ఏ సమస్యనైనా 45 రోజుల్లో పరిష్కరిస్తామని తహశీల్దార్ నజీర్ అహ్మద్ పేర్కొన్నారు. సోమవారం పులివెందుల మున్సిపాలిటీలోని చిన్న రంగాపురం గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఆయన ప్రజలు, రైతులకు సంబంధించిన వివిధ సమస్యలు, భూసమస్యల వినతి పత్రాలను స్వీకరించారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, గ్రామస్థులు, రైతులు పాల్గొన్నారు.