నంద్యాల: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ 96 ఫిర్యాదులను స్వీకరించారు. పట్టణంలోని శిల్ప నగర్కు చెందిన కుమార్ అనే వ్యక్తి ఉద్యోగం ఇస్తానని నమ్మించి నా వద్ద నుంచి రూ. 2.30 లక్షల రూపాయలు డబ్బులు తీసుకుని ఉద్యోగం ఇవ్వకుండా మోసం చేశారని నంద్యాలకు చెందిన సుమలత ఎస్పీకి ఫిర్యాదు చేశారు.