పల్నాడు: ఫిరంగిపురం దీనాపూర్లోని డాక్టర్ రంజన్ బాబు కమ్యూనిటీ జూనియర్ కళాశాలలో పల్నాడు జిల్లా రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 15,16 తేదీలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలు సోమవారంతో ముగిశాయి. కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొని విజేతలకు కప్పులు, ప్రశంసా పత్రాలు అందజేశారు.