E.G: రాష్ట్రంలో అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు 34 షెడ్యూల్ తెగల వారు ఉన్నారని వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఎస్టీ కమిషన్ సభ్యులు శంకర్ నాయక్ తెలిపారు. రాజమండ్రి రూరల్ మండలం వేమగిరి పంచాయతీ వద్ద సోమవారం గిరిజన సంక్షేమ శాఖ అధికారి జ్యోతి మండల స్థాయి అధికారులతో ST కుల పెద్దలతో సమావేశం నిర్వహించి, వారి సమస్యలు తెలుసుకున్నారు.