AP: అనకాపల్లి జిల్లాలోని బాణసంచా కేంద్రాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. వేట్లపాలెం ప్రమాదం నేపథ్యంలో నిఘా పెంచారు. అనకాపల్లి, నర్సీపట్నం, పరవాడ డీఎస్పీలు తనిఖీలు ముమ్మరం చేశారు. అనధికారికంగా బాణసంచా తయారు చేసినా.. నిల్వ చేసినా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా హెచ్చరించారు.