కాకినాడ: అమరజీవి స్వర్గీయ శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతిని కాకినాడలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా CBM స్కూల్ రోడ్ నందు ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్రరాష్ట్ర సాధనకు పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం చేశారని అన్నారు.