W.G: పాలకొల్లులో ‘సేవ్ ద గర్ల్’ నినాదంతో 2కె రన్ కార్యక్రమాన్ని ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. 19వ శతాబ్దం తొలినాళ్లలో ఆడబిడ్డ పుడితే లక్ష్మీదేవి పుట్టిందనే ఒక ఆనందంతో ఉండేవారని, కానీ ప్రస్తుత రోజుల్లో ఆడపిల్ల పుడితే భారంగా చూస్తున్నారన్నారు. అడబిడ్డ విలువ తెలిసేందుకే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు.