KRNL: కౌతాళం మండలంలోని మెళిగనూరు సమీపంలో తుంగభద్ర నదిలో మొసళ్లు హల్ చల్ చేస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో గ్రామస్థులు నదిలోకి వెళ్లాలంటే భయపడి పోతున్నామన్నారు. నదిలో సంచరిస్తున్న మొసళ్లు అప్పుడప్పుడు నదిలో గట్ల పైకి వస్తున్నాయి. వీటిని గమనించిన గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.