NDL: బేతంచెర్ల మండల పరిధిలోని గోర్లగుట్ట గ్రామంలో శనివారం జరిగిన సాగునీటి సంగం ఎన్నికలు ప్రశాంతంగా జరగడంతో రైతులు, అధికారులు, పోలీసులకు ఎన్నికల అధికారి ఫజుల్ రహిమాన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన సాగునీటి సంఘం చైర్మన్ లింగాల పద్మనాభుడు, వైస్ చైర్మన్ పెద్ది సావిత్రిలకు డిక్లరేషన్ ఫారం అందజేసి అభినందనలు తెలిపారు.