NLR: రాపూరు మండలం సిద్ధవరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు విద్యార్థులు వెళ్లడానికి ఒక వాగును దాటే నీళ్లు ఉన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. పాఠశాల వైపు మండల విద్యాధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షపు నీరు వల్ల దోమలు చేరి విద్యార్థులు విష జ్వరాలకు గురయ్యే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.