SRCL: రైతులు పకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని మండల వ్యవసాయ శాఖ అధికారి దుర్గరాజు అన్నారు. చందుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ మిషన్ ఆన్ నాచురల్ ఫార్మింగ్, ప్రకృతి వ్యవసాయం పైన అవగాహన, దిశ నిర్దేశం కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. దుర్గరాజు మాట్లాడుతూ.. రైతులు పంటల సాగులో రసాయనాలను తగ్గించాలన్నారు.