ELR: రైతులకు అండగా ఏలూరు జిల్లాలో వైసీపీ నేతలు పోరుబాట కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని స్థానిక పవర్పేట వైఎస్ఆర్ విగ్రహనికి జిల్లా నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.