ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ కేంద్రమంత్రులతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కలవనున్నారు. అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చించనున్నారు. అనంతరం అధిష్టానం పెద్దలను సీఎం కలిసే అవకాశం ఉంది.