NLR: నెల్లూరు కలెక్టరేట్లో రేపు యథావిధిగా PGRS కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ప్రజల నుంచి వివిధ సమస్యలపై ఫిర్యాదులను స్వీకరిస్తామన్నారు. అర్జీదారులు తమ అర్జీలను అధికారిక వెబ్సైట్ Meekosam.ap.gov.in నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీ స్థితి లేదా ఇతర వివరాలకు సంబంధించి సమాచారం కోసం నేరుగా 1100 కాల్ సెంటర్ను సంప్రదించాలని ఆయన కోరారు.