ATP: ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది ఉమ్మడి అనంతపురం జిల్లాలో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాస్త్రవేత్త నారాయణస్వామి తెలిపారు. సముద్రంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల రుతుపవనాలపై ప్రభావం పడుతుందన్నారు. మార్చి నుంచే ఎండలు ముదురుతాయని, రైతులు బెట్టకు తట్టుకునే స్వల్పకాలిక పంటలు సాగు చేయాలని సూచించారు.