సత్యసాయి: జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ జిల్లా పోలీస్ కార్యాలయంలో పదవీ విరమణ చేసిన ఏఆర్ ఏఎస్ఐ భాషా, హెడ్ కానిస్టేబుల్ ఎర్రిస్వామిలను ఘనంగా సన్మానించారు. వారి సేవలను కొనియాడుతూ జ్ఞాపికలు అందజేశారు. కష్టసమయాల్లోనూ శాఖకు అందించిన సేవలు అమూల్యమని ఎస్పీ ప్రశంసించారు. విశ్రాంతి జీవితం కుటుంబంతో ఆయురారోగ్యాలతో గడపాలని ఆకాంక్షించారు.