అన్నమయ్య: అప్పుల బాధను తట్టుకోలేక రామసముద్రం మండలం పేడరాసుపల్లికి చెందిన రైతు నారాయణ (59) పురుగుల మందు తాగి శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వ్యవసాయం కోసం తీసుకున్న సుమారు రూ. 7 లక్షల అప్పులు, టమోటా సాగులో ఆశించిన ధర రాక నష్టపోవడంతో ఆయన ఈ దారుణ నిర్ణయం తీసుకున్నారు. కుటుంబ సభ్యులు గమనించి,చికిత్స కోసం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు.