MBNR: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఎం ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకం ద్వారా ఉపకార వేతనం పొందేందుకు అర్హత కలిగిన మైనార్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ అధికారి శంకరా చారి ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఈ-పాస్ సైట్ను ఉపయోగించి ఆన్ లైన్లో ఈనెల 1 నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని మైనార్టీలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.