HYD: మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్కులను సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాదిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ప్రమాదంలో మృతి చెందిన 44 కుటుంబాల వారికి రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారి కుటుంబానికి రూ.3 లక్షల చెక్కులను అందజేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం మీది.. మీకు అండగా ఉంటాం అంటూ భరోసా కల్పించారు.