KNR: ఇల్లందకుంట(M) కేంద్రంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానాన్ని మార్చి 3, మంగళవారం చంద్ర గ్రహణం పురస్కరించుకుని మూసివేస్తున్నట్లు ఆలయ ఛైర్మన్ ఇంగిలే రామారావు, ఈఓ సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రహణ ప్రభావం దృష్ట్యా ఉదయం 7:00 గంటలకే ఆలయ ద్వారాలు మూసివేస్తామని వివరించారు. మరుసటి రోజు ఉదయం ఆలయ శుద్ధి, సంప్రోక్షణ అనంతరం 10:00 గంటలకు భక్తులకు దర్శనం ఉంటుందని తెలిపారు.