SKLM: పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి తన కార్యాలయంలో క్యాంప్ కార్యాలయంలో శనివారం నియోజకవర్గ వైసీపీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామ కమిటీలు చురుకుగా పనిచేస్తూ గ్రామస్థాయిలో వైసీపీ పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను బహిర్గతం చేస్తూ ప్రజలకు నిజ పరిస్థితులను తెలియజేయాలన్నారు.