ELR: ఉంగుటూరు(మం) ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మరాజు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మండల పరిధిలో పూర్తైన అభివృద్ధి పనులు, ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమగ్రంగా సమీక్షించారు. అనంతరం వివిధ గ్రామాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలను ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధుల ద్వారా తెలుసుకున్నారు.