PDPL: ధర్మారంలో సాధన జూనియర్ కాలేజీలో ఇవాళ నిర్వహించిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఆంగ్ల పరీక్షకు 5 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు చీఫ్ సూపరింటెండెంట్ వెల్లడించారు. మొత్తం 143 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావలసి ఉండగా, 138 మంది హాజరయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు పేర్కొన్నారు.