MNCL: మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మందమర్రి మండల పంచాయతీ అధికారి ములకల సత్యనారాయణ మృతి చెందారు. బైక్పై వెళ్తుండగా అతివేగంగా వచ్చిన లారీ ఆయన్ని బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. ఆయన ప్రాణాలు విడిచారు. ఈ ఘటనపై మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.