SRPT: పాఠశాలల్లో విద్యార్థులకు చదవడం, రాయడం వంటి కనీస సామర్ధ్యాలతోపాటు గణితంలో చతుర్వధ ప్రక్రియపై పట్టు సాధించిన ఉపాధ్యాయులు కృషి చేయాలని కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్ సూచించారు. శనివారం కోదాడ పట్టణంలోని శ్రీరామ్ నగర్ ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు. అనంతరం పాఠశాల పరిసరాలు పరిశీలించారు.