RR: షాద్ నగర్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పట్టాలు పంపిణీ చేశారు. తొలివిడతగా లబ్ధిదారులకు 1,200 ఇళ్లను అందజేస్తున్నట్లు ఆయన వివరించారు. 28 వార్డుల్లో ఉన్న లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా కౌన్సిలర్లు లబ్ధిదారులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలన్నారు.