హిందీ నిర్మాత దీపక్ ముకుత్ త్వరలో ఒక భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. బాబీ డియోల్, అభిషేక్ బచ్చన్ కాంబోలో ‘దో ఔర్ దో పాంచ్’ సినిమాను రీమేక్ చేయాలని ఆయన పదేళ్లుగా భావిస్తున్నాడట. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉందని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ ఇద్దరు హీరోల క్రేజీ కాంబినేషన్ వెండితెరపై ఎలా ఉంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.