BDK: పేద కుటుంబాలకు గృహ నిర్మాణ పథకాల ద్వారా సొంత ఇంటి కల నెరవేరుతోందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం మణుగూరు మండలం సాంబాయిగూడెం గ్రామంలో లబ్ధిదారులైన జబీనా ఇందిరమ్మ ఇంటి ప్రవేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రతి పేద కుటుంబం సురక్షితమైన నివాసంలో గౌరవప్రదంగా జీవించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు.