NZB: జిల్లాలోని 5వ డివిజన్ కార్పొరేటర్ నరేష్ శనివారం ‘బస్తీ బాట’ కార్యక్రమం నిర్వహించారు. డివిజన్లోని పలు కాలనీల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులను స్వయంగా పర్యవేక్షించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రభుత్వ చెత్త సేకరణ వాహనం మరమ్మతుకు గురైందని, కావున ప్రజలు కొన్ని రోజుల పాటు చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయవద్దని విజ్ఞప్తి చేశారు.