మావోయిస్టుల ఏరివేత లక్ష్యంలో భాగంగా భద్రతా దళాల ఆపరేషన్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే వందలాది మంది నక్సల్స్ లొంగిపోగా.. చాలా మంది ఎదురుకాల్పుల్లో మరణించారు. మిగిలిన వారూ అడవులు వీడి జనజీవన స్రవంతిలోకి రావడం తప్ప మరో మార్గం లేదని మాజీ మావోయిస్టు మల్లోజుల వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. ఇటీవల మహారాష్ట్ర సీఎం ఎదుట మల్లోజుల లొంగిపోయిన విషయం తెలిసిందే.