TPT: గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందినట్లు గూడూరు ఒకటో పట్టణ పోలీసులు తెలిపారు. ఈనెల 5వ తేదీన నరసింహారెడ్డి అనే వ్యక్తి అనారోగ్యంతో గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. అతనికి వైద్య చికిత్స అందిస్తున్న నేపథ్యంలో శుక్రవారం గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారని ఒకటవ పట్టణ ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు.