MBNR: సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ చెస్ టోర్నమెంట్లో పాల్గొనేందుకు పాలమూరు యూనివర్సిటీ చెస్ పురుషుల జట్టు తమిళనాడులోని భారతీదాసన్ యూనివర్సిటీ తిరుచిరాపల్లికి బయలుదేరింది. వీసీ శ్రీనివాస్ క్రీడాకారులకు క్రీడా దుస్తులు అందజేసి, క్రమశిక్షణతో సాధన చేసి విజయాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్ బాబు, పీడీ డా. శ్రీనివాస్ పాల్గొన్నారు.