కడప: నగర పాలక సంస్థ కమిషనర్ రాకేష్ చంద్ర శుక్రవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆస్తి పన్ను వసూళ్లను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో యూఎఫ్ఎస్ సర్వేను త్వరగా పూర్తి చేయాలని, పెండింగ్లో ఉన్న పనులను వేగంగా పూర్తి చేసి, సిబ్బంది పనితీరును మెరుగుపరచుకోవాలని సూచించారు.