AKP: జనసేన ఉత్తరాంధ్ర రాజకీయ వ్యవహారాల ప్రతినిధి సుందరపు సతీశ్ కుమార్ శుక్రవారం అచ్యుతాపురం మండలం ఎర్రవరంలో రూ. 15 లక్షల జిల్లా పరిషత్ నిధులతో చేపట్టే ఇంటింటి కుళాయి పనులను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ హయాంలో పడకేసిన పథకాలను పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుందని చెప్పారు.