కడప: కలెక్టరేట్లో జరిగిన డైపీసీ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా అందిన 11,033 దరఖాస్తుల్లో 10,886కి అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. వివిధ పారిశ్రామిక అభివృద్ధి పాలసీల కింద రూ.3.53 కోట్లకు పైగా నిధుల విడుదలకు అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు.