KDP: పులివెందుల సమీపంలోని అంబకపల్లె రోడ్డు వద్ద ఉన్న కాలువలో ఈతకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. కొంతసేపటి శ్రమ అనంతరం ఫైర్ సిబ్బంది శుక్రవారం మృతదేహాన్ని కాలువ నుంచి బయటకు తీశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.