AP: 18 ఏళ్లు పోరాడినా న్యాయం జరగలేదని ఆయేషా తండ్రి ఇక్బాల్ ఆరోపించాడు. ‘ఆడపిల్ల హత్యకు గురైతే సాక్ష్యం లేదని కేసు మూసేశారు. దర్యాప్తును నీరుగార్చడం వల్లే న్యాయం జరగలేదు. అనుమానితులను ఎందుకు అరెస్ట్ చేయలేదు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. డిసెంబర్ 27 ఆయేషా సంస్మరణ దినంగా ప్రకటించాలి. ఆయేషా పేరుపై ట్రస్ట్ ఏర్పాటు చేయాలి’ అని డిమాండ్ చేశాడు.