KNR: సైదాపూర్ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ దుస్స కుమార్ రాష్ట్ర ఉప సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శిగా గురువారం నియామకం అయ్యారు. హైదరాబాద్లో సంఘం అధ్యక్షుడు రాములు నాయక్, ఉపాధ్యక్షుడు కార్తీక్ ఆయనకు నియామక పత్రం అందజేశారు. తనపై నమ్మకంతో బాధ్యత అప్పగించిన కమిటీకి కృతజ్ఞతలు తెలిపిన కుమార్.. ఉప సర్పంచుల బలోపేతానికి కృషి చేస్తానన్నారు.