AKP: పాయకరావుపేట మండలంలో రబీలో సాగు చేస్తున్న పంటలకు ఈ క్రాప్ నమోదు 92% పూర్తయినట్లు మండల వ్యవసాయ అధికారి ఆదినారాయణ గురువారం తెలిపారు. 1,110 హెక్టార్లలో రైతులు పంటలను సాగు చేస్తున్నట్లు తెలిపారు. మిగిలిన పంటలకు సంబంధించి ఈ క్రాప్ నమోదు రెండు రోజుల్లో పూర్తవుతుందన్నారు. ఈ క్రాప్ నమోదు చేసుకున్న రైతులకే రైతు సంక్షేమ పథకాలు వర్తిస్తాయన్నారు.