AP: తిరుమల లడ్డూ నెయ్యి సరఫరాపై బాధ్యతగా ఉండాలని, అవసరమైతే టాటా, రిలయన్స్ సంస్థల సహకారం తీసుకోవాలని బీజేపీ MLC సోము వీర్రాజ్ సూచించారు. ‘వైసీపీ వాళ్లు 420 కాబట్టే నెయ్యిని 320కి కొన్నారు. స్వచ్ఛమైన ఆవు నెయ్యి కిలో రూ.2 వేల వరకు ఉంటుంది. లడ్డూలో వాడేది అసలు నెయ్యి కాదు. తిరుమలలోనే కాదు అన్ని ఆలయాల్లోనూ.. స్వచ్ఛమైన నెయ్యితో లడ్డూ తయారు చేయాలి’ అని పేర్కొన్నారు.