కోనసీమ: క్షణ కాలంలో ముక్తిని ప్రసాదించే స్వామిగా క్షణ ముక్తేశ్వర స్వామి ప్రసిద్ధి చెందారు. అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలో ఉన్న ఈ ఆలయాన్ని శ్రీరాముడు స్వయంగా శివలింగాన్ని ప్రతిష్టించాడని చరిత్ర చెబుతోంది. ఇక్కడి శివలింగం చిన్నగా రుద్రాక్ష ఆకారాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయం అత్యంత పురాతన మైన శైవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.