KDP: బ్రహంగారిమఠంలోని పోతులూరి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములవారి మఠంలో స్వామివారికి ఆరాధన గురు పూజ మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా.. శనివారం శ్రీ వీరబ్రహ్మ సుప్రభాతంతో ప్రారంభించి విశేష అభిషేకాది పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గుడి ఉత్సవం చేశారు.