MDK: టేక్మాల్ మండల కేంద్రంలో కుర్మ నర్సింలు, లక్ష్మి దంపతులు తమ నిజాయితీని చాటుకున్నారు. కొరంపల్లికి చెందిన పాషా అనే వ్యక్తి పోగొట్టుకున్న పర్సు వీరికి రోడ్డుపై దొరకగా, వెంటనే దానిని పోలీసులకు అందజేశారు. పర్సులోని నగదు, పత్రాలు భద్రంగా ఉండటంతో పోలీసులు దానిని యజమానికి అప్పగించారు. ఈ సందర్భంగా నర్సింలు దంపతులను పోలీసులు ఘనంగా సన్మానించి అభినందించారు.